కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి | In UP 4 Arrested For Torturing Monkey | Sakshi
Sakshi News home page

శాడిజానికి పరాకాష్ట అంటే ఇదే.. నలుగురు అరెస్ట్‌

Jul 18 2020 12:30 PM | Updated on Jul 18 2020 12:49 PM

In UP 4 Arrested For Torturing Monkey - Sakshi

లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement