వామ్ మొబైల్ ప్రచారకర్తగా క్రిస్ గేల్
దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీ వామ్ ప్రచారకర్తగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ను నియమించింది.
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీ వామ్ ప్రచారకర్తగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ను నియమించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వామ్ ఫీచర్, స్మార్ట్ ఫోన్లు, ట్యాబె ్లట్స్ను ఆంధ్రదేశ్తోసహా వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తోంది. ఈ ఉత్పత్తులకు గేల్ ప్రచారం చేస్తారు. 32 రకాల మోడళ్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ.999-14,999 మధ్య ఉన్నాయి.


