
హెచ్చుతగ్గుల సెన్సెక్స్..
బీఎస్ఈ 30 స్టాక్స్ సెన్సెక్స్ గురువారం 134 పాయింట్ల నష్టంతో 28,371 పాయిం ట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50
ఆదిలో లాభాలు... ఆపై నష్టాలు...
బీఎస్ఈ 30 స్టాక్స్ సెన్సెక్స్ గురువారం 134 పాయింట్ల నష్టంతో 28,371 పాయిం ట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 44 పాయింట్ల నష్టంతో 8,590 పాయింట్ల వద్దకు జారింది.
శ్రేణి ఇదీ: సెన్సెక్స్ లాభంలోనే (బుధవారం ముగింపు 28,505) 28,540 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 28,578 పాయింట్లను చేరింది. చివరికి గురువారం గరిష్టంతో పోల్చితే 207 పాయింట్ల తక్కువతో, బుధవారంతో పోల్చితే 134 పాయింట్ల మైనస్తో ముగిసింది.
కారణాలు ఏమిటి?: పటిష్ట ఆసియన్ మార్కెట్లు, కీలక జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశలతో తొలుత మార్కెట్ లాభాల్లో ప్రారంభమైంది. అయితే పలు బ్లూచిప్ స్టాక్స్ నష్టాలకు గురికావడం మధ్యాహ్నం తరువాత సెన్సెక్స్ అధిక పతనానికి ప్రధాన కారణమైంది. దీనికితోడు రూపాయి బలహీన ధోరణీ ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావం చూపింది.
లాభనష్టాల్లో...: 30 షేర్ ఇండెక్స్లో 18 నష్టపోయాయి. ట్రేడయిన షేర్లలో 1,531 లాభపడ్డాయి. 1,311 షేర్లు నష్టపోయాయి. 126 స్థిరంగా ఉన్నాయి.
టర్నోవర్..: టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,403 కోట్లు. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.18,170 కోట్లు. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,86.556 కోట్లు.