టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ టెల్కోల సేవలు మెరుగుపడట్లేదని వ్యాఖ్య...
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం కంపెనీలు తమ కస్టమర్లను పెంచుకుంటున్నాయే తప్ప అధ్వాన్నంగా ఉంటున్న సేవల నాణ్యతను మెరుగుపర్చుకోవడం లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మొబైల్ కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ సోమవారం రాజ్యసభలో దీనిపై లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు.
ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్గా పరిగణిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిందిగా టెలికం కంపెనీలను ఆదేశించామని, ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ప్రసాద్ వివరించారు. ‘నేను కఠినంగా వ్యవహరించే మంత్రిని. సేవలు మెరుగుపడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాము’ అని ఆయన తెలిపారు. వొడాఫోన్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీల చీఫ్లు కూడా సమస్యలను అంగీకరించి, సర్వీసులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారు.
దేశవ్యాప్తంగా 18 లక్షల పైచిలుకు ప్రైవేట్ కంపెనీల మొబైల్ టవర్లు ఉండగా, వీటిలో 35,000 టవర్లలో లోపాలు ఉన్నాయని ఒక సర్వేలో గుర్తించినట్లు మంత్రి వివరించారు. వీటిలో 20,000 దాకా టవర్లను సరిదిద్దడం జరిగిందని, మిగతావాటిని సరిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గడిచిన మూడు నెలల్లో ప్రైవేట్ టెల్కోలు 14,000 పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేశాయన్నారు. కాల్ డ్రాప్ విషయంలో టెల్కోలపై జరిమానా విధించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫర్సులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను మళ్లీ లాభాల బాట పట్టిస్తానని ఆయన తెలిపారు.
కాల్డ్రాప్స్ విషయంలో కఠిన చర్యలు
Published Tue, Dec 8 2015 5:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement