పాన్‌, ఆధార్‌ లింక్‌ : మరోసారి ఊరట

PAN Aadhaar Linking Deadline Extended To December - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్‌ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్‌ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా పాన్‌ కార్డును ఇంకా ఆధార్‌తో లింక్‌ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్‌లైన్‌లోగా పాన్‌తో ఆధార్‌ లింక్‌ కాకుంటే పాన్‌ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్‌ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top