ఆన్‌లైన్‌ కొనుగోళ్లను పారదర్శకం చేస్తాం | Online purchases will be transparent | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కొనుగోళ్లను పారదర్శకం చేస్తాం

Mar 16 2018 1:08 AM | Updated on Mar 16 2018 1:08 AM

Online purchases will be transparent - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుస్తామని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. వినియోగదారులకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పరంగా ఎదురవుతున్న సమస్యల విషయమై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు ఆమోదం అనంతరం ఈ కామర్స్‌ నియంత్రణకు సమగ్రమైన నిబంధనలను తీసుకొస్తామని ఆయన చెప్పారు.

‘‘సాధారణ షాపింగ్‌ పరంగా లేని సమస్యలు ఆన్‌లైన్‌ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం’’ అని రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. డిజిటల్‌ చెల్లింపులు, తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement