
డెల్టా కంపెనీలకు భారీ షాక్
పనామాలోని డెల్టా షిప్పింగ్ మెరైన్ సర్వీసెస్ కంపెనీ, ఖతార్లోని దాని అనుబంధ కంపెనీలకు ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: పనామాలోని డెల్టా షిప్పింగ్ మెరైన్ సర్వీసెస్ కంపెనీ, ఖతార్లోని దాని అనుబంధ కంపెనీలు డెల్టా నావిగేషన్, డెల్టా గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100 కోట్ల జరిమానా విధించింది. 2011లో ఈ కంపెనీకి చెందిన సరుకు రవాణా నౌక ముంబై వద్ద మునిగింది. దీనికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని తేల్చిన ట్రిబ్యునల్ నౌక నుంచి వెలువడిన ఆయిల్తో నీరు కలుషితమైందని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా రూ.100 కోట్లను నౌకాయాన శాఖకు చెల్లించాలని ఎన్జీటీ తీర్పు వెలువరించింది. ముంబైకి చెందిన పర్యావరణవేత్త సమీర్ మెహతా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
60054 మెట్రిక్ టన్నుల బొగ్గు సముద్రతీరంలో పారేసినందుకు రూ.5 కోట్లు పర్యావరణ పరిహారంగా చెల్లించాలని గుజరాత్ కు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీని ఎన్జీటీ ఆదేశించింది.