
భారత్ వృద్ధి రేటు 8% పైనే: వెంకయ్య నాయుడు
భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టిందని, రాబోయే రోజుల్లో వృద్ధి రేటు 8% దాటగలదని కేంద్ర పట్టణాభివృద్ధి
వాషింగ్టన్లో జరిగిన అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రతినిధులతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు
వాషింగ్టన్ : భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టిందని, రాబోయే రోజుల్లో వృద్ధి రేటు 8% దాటగలదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులు పెట్టాలని అమెరికా ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అమెరికాలో అయిదు రోజుల అనధికారిక పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడు.. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.
తమ సర్కారు మానవీయ కోణంలో సంస్కరణలు అమలు చేస్తోందని, పలు సామాజిక భద్రత పథకాలు కూడా ప్రవేశపెడుతోందన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవాలని అమెరికా ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు. మరోవైపు, పన్నులు, భూసేకరణ మొదలైన అంశాల్లో సంస్కరణల అమలే... పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలకం అవుతాయని యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి పేర్కొన్నారు.