అత్యంత విలువైన బ్రాండ్గా మళ్లీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా హెచ్డీఎఫ్సీ బ్యాంకు మళ్లీ నిలిచింది. బ్రాండ్జ్ ఇండి యా టాప్ 50లో తొలి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది దక్కించుకుంది. నివేదిక ప్రకారం.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాండ్ విలువ 21% వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్ డాలర్లకు చేరింది.
ఎల్ఐసీ 19.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ (15 బి. డాలర్లు) మూడో స్థానంలో, ఫ్లిప్ కార్ట్ (4.1 బి.డాలర్లు) 11, పేటీఎం (4.1 బి.డాలర్లు) 12, జీటీవీ (3.8 బి.డాలర్లు) 15వ స్థానంలో టాప్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
మరిన్ని వార్తలు