కొటక్‌ మహింద్రా 20 శాతం జంప్‌ | Kotak Mahindra Bank posts 20% YoY rise in profit at Rs 1,440 crore | Sakshi
Sakshi News home page

కొటక్‌ మహింద్రా 20 శాతం జంప్‌

Oct 25 2017 2:42 PM | Updated on Oct 25 2017 5:18 PM

Kotak Mahindra Bank posts 20% YoY rise in profit at Rs 1,440 crore

సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్‌ రంగ బ్యాంకు కొటక్‌ మహింద్రా సెప్టెంబర్‌ క్వార్టర్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభాల్లో 20 శాతం జంప్‌ చేశాయి. ఏడాది ఏడాదికి బ్యాంకు లాభాలు 19.81 శాతం పెరిగి రూ.1,440.68 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు లాభాలు రూ.1,202.40 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయాలు కూడా 15.80 శాతం పెరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.2,664.21 కోట్లగా ఉన్న బ్యాంకు నికర వడ్డీ ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.3,085.26 కోట్లగా ఉన్నాయి.  

ఈ క్వార్టర్‌లో ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడిందని కొటక్‌ మహింద్రా బ్యాంకు తన ఫలితాల్లో ప్రకటించింది. స్థూల నిరర్థక ఆస్తులు నుంచి స్థూల అడ్వాన్సుల  వరకు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 2.14 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీఏ నుంచి నికర అడ్వాన్సుల వరకు 1.08 శాతమున్నాయి. స్టాండలోన్‌ ఆధారితంగా బ్యాంకు నికర లాభాలు 22.25 శాతం పెరిగి, రూ.994.31 కోట్లగా రి​కార్డయ్యాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బ్యాంకు షేర్లు 4.87 శాతం కిందకి ట్రేడవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement