మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు | India asks UK not to consider Vijay Mallya's asylum request | Sakshi
Sakshi News home page

మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు

Jun 12 2020 6:13 AM | Updated on Jun 12 2020 6:13 AM

India asks UK not to consider Vijay Mallya's asylum request - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ వ్యాపారస్తుడు విజయ్‌ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్‌ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్‌ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్‌లైన్‌ మీడియా బ్రీఫింగ్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement