20న జీఎస్‌టీ మండలి సమావేశం | GST Meeting in Goa | Sakshi
Sakshi News home page

20న జీఎస్‌టీ మండలి సమావేశం

Sep 14 2019 11:36 AM | Updated on Sep 14 2019 11:36 AM

GST Meeting in Goa - Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వచ్చే శుక్రవారం (20వ తేదీన) గోవాలో జరగనుంది. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై ఈ అత్యున్నత స్థాయి జీఎస్‌టీ సమావేశం దృష్టి సారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యక్షంగా ఎటువంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మండలి సమీక్షిస్తుందని తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆరి్థక మందగమనం, ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో జీఎస్‌టీ తగ్గింపునకు సంబంధిత వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement