మ్యూచువల్‌ ఫండ్‌ నిధుల్లో 4 శాతం పెరుగుదల | Four Percent Funds Rises in Mutual Funds | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్‌ నిధుల్లో 4 శాతం పెరుగుదల

Sep 10 2019 1:17 PM | Updated on Sep 10 2019 1:17 PM

Four Percent Funds Rises in Mutual Funds - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోలి్చతే 4% వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్‌ స్కీమ్‌లలో పెట్టుబడుల  జోరుతో ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. దీనిలో లిక్విడ్‌ ఫండ్స్‌ వాటా రూ.79,000 కోట్లు. ఓపెన్‌–ఎండ్‌ ఈక్విటీ పథకాల్లోకి రూ.9,152 కోట్లు చేరినట్లు తెలిపింది. అయితే, క్లోజ్‌–ఎండ్‌ ఈక్విటీ పథకాల నుంచి రూ.62 కోట్ల ఉపసంహరణ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement