ఫ్లిప్కార్ట్ సేల్; స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
మంత్ ఎండ్ సేల్; ఆగస్టు 26-31 దాకా
స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి ఆఫర్లను పండుగను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్ ఎండ్ మొబైల్స్ఫెస్ట్ పేరుతో అయిదు రోజుల పాటు ఆగస్టు 26 నుంచి 31 వరకు స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో వివిధ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్మి వై2, రెడ్ మి 6, రిలయన్ మి 2 ప్రొ పై డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది. రెడ్మి 6పై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.
రెడ్మి 6 స్మార్ట్ఫోన్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ.6,999కే అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ. 10,499. రియల్మి 2 ప్రొ ధర రూ. 8,999 అసలు ధర రూ.13,990. దీంతోపాటు సాధారణ ఎక్స్చేంజ్తో పోలిస్తే అదనంగా వెయ్యిరూపాయలను ఫ్లిప్కార్ట్ అందివ్వనుంది. ఇంకా హానర్, వివో, శాంసంగ్, ఆసుస్ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై కూడా తక్కువ ధరలను ప్రకటించింది.