ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

Finance Ministry asks govt depts, agencies to continue to bank services - Sakshi

అది ప్రభుత్వానిదే;

పూర్తి సామర్థ్యం ఉంది

ఆర్థికశాఖ భరోసా  

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు తగిన సామర్థ్యం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమోటర్‌ ఎల్‌ఐసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎల్‌ఐసీ, ప్రభుత్వం రెండింటికీ కలిపి బ్యాంకులో 97.46 శాతం వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ ఈ ఏడాది జనవరిలో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనితో బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాం కుగా ఆర్‌బీఐ పునర్‌ వ్యవస్థీకరించింది. బ్యాంకు లో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 46.46 శాతం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top