బిగ్‌ బుల్‌కు షాక్‌: జైలు శిక్ష, జరిమానా | Court orders three years jail to Ketan Parekh for non-payment of penalty | Sakshi
Sakshi News home page

బిగ్‌ బుల్‌కు షాక్‌: జైలు శిక్ష, జరిమానా

Feb 28 2018 10:42 AM | Updated on Feb 28 2018 4:36 PM

Court orders three years jail to Ketan Parekh for non-payment of penalty - Sakshi

సెబీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై:  మాజీ స్టాక్ బ్రోకర్లు కేతన్ పరేఖ్‌, కార్తీక్‌ పరేఖ్‌లకు సెబీ ప్రత్యేక  కోర్టు  జైలు శిక్ష విధించింది. స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో భారీ అక్రమ లావాదేవీలు లాంటి పలు కేసుల్లో నేరస్తుడిగా తేలిన  పరేఖ్‌బ్రదర్స్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు  సెబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా  ప్రకటించింది.

కేతన్‌, కార్తీక్‌ డైరెక్టర్లుగా ఉన్న పాంథర్‌ ఫిన్‌కార్ప్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సెబీ నిబంధనలను వ్యతిరేకంగా షాంక్‌ టెక్నాలజీస్‌ ఇంటర్నేషనల్‌​ లిమిటెడ్‌ నుంచి  పరిమితికి మించి షేర్లను అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ ఉల్లంఘనల పై విచారణను 2003 లో పూర్తి చేసిన సెబీ  రూ.6.5 లక్షల జరిమానా విధించింది. దీనిపై నిందితులు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ (సాట్‌)ను ఆశ్రయించారు. అయితే దీన్ని(2007) తోసి పుచ్చడంతో పాటు 45రోజులలోపు ఈ జరిమానాను చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే సాట్‌ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్‌ చేయక పోవడంతో ఈ కేసు ముగిసిందని సెబీ కోర్టు ప్రకటించింది.  అలాగే జరిమానాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని సెబీని పరేఖ్‌ బ్రదర్స్‌కు వేడుకున్నారు. ఇది సెబీ నిబంధనలకు  విరుద్ధమంటూ ఈ ప్రతిపాదను తోసి పుచ్చింది.  పెనాల్టీని చెల్లించకపోవడంతో  తదుపరి చర్యలకు  సెబీ ఉపక్రమించింది.  పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ   బేఖాతరు చేయడంతో  కోర్టుముందు హాజరుకావల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలోనే గత నవంబరులో కోర్టుకు హాజరైన కేతన్‌ పరేఖ్‌ను కస్టడీకి తరిలించగా అప్పటినుంచి జైల్లోనే  ఉన్నాడు.  దీనిపై విచారించిన సెబీ ప్రత్యేక కోర్టు తాజా తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement