-
బిగ్ బుల్కు షాక్: జైలు శిక్ష, జరిమానా
సాక్షి, ముంబై: మాజీ స్టాక్ బ్రోకర్లు కేతన్ పరేఖ్, కార్తీక్ పరేఖ్లకు సెబీ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. స్టాక్ ఎక్స్చేంజ్లో భారీ అక్రమ లావాదేవీలు లాంటి పలు కేసుల్లో నేరస్తుడిగా తేలిన పరేఖ్బ్రదర్స్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. కేతన్, కార్తీక్ డైరెక్టర్లుగా ఉన్న పాంథర్ ఫిన్కార్ప్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సెబీ నిబంధనలను వ్యతిరేకంగా షాంక్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి పరిమితికి మించి షేర్లను అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ ఉల్లంఘనల పై విచారణను 2003 లో పూర్తి చేసిన సెబీ రూ.6.5 లక్షల జరిమానా విధించింది. దీనిపై నిందితులు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ను ఆశ్రయించారు. అయితే దీన్ని(2007) తోసి పుచ్చడంతో పాటు 45రోజులలోపు ఈ జరిమానాను చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే సాట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేయక పోవడంతో ఈ కేసు ముగిసిందని సెబీ కోర్టు ప్రకటించింది. అలాగే జరిమానాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని సెబీని పరేఖ్ బ్రదర్స్కు వేడుకున్నారు. ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ ఈ ప్రతిపాదను తోసి పుచ్చింది. పెనాల్టీని చెల్లించకపోవడంతో తదుపరి చర్యలకు సెబీ ఉపక్రమించింది. పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేయడంతో కోర్టుముందు హాజరుకావల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గత నవంబరులో కోర్టుకు హాజరైన కేతన్ పరేఖ్ను కస్టడీకి తరిలించగా అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. దీనిపై విచారించిన సెబీ ప్రత్యేక కోర్టు తాజా తీర్పునిచ్చింది. -
కనుమరుగవుతున్న కంపెనీలు!
అక్రమ లావాదేవీలతో స్టాక్ మార్కెట్లను ఒక ఊపుఊపి చివరకు బోర్డు తిప్పేసిన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్ గుర్తున్నాడు కదా? ఇతడు సృష్టించిన బూమ్లో మార్కెట్ ఫేవరెట్లుగా ఒక వెలుగువెలిగిన పలు షేర్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కనిపించకుండా పోవడం చెప్పుకోదగ్గ పరిణామం! ఈ జాబితాలో సిల్వర్లైన్ టెక్నాలజీస్, పరేఖ్ ప్లాటినం, ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్స్, టెలిడేటా మెరైన్లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. కేతన్ స్కామ్ బయటపడ్డాక ఈ షేర్ల ధరలు పాతాళానికి పడిపోవడమేకాకుండా ఎక్స్ఛేంజీల కన్నెర్రకు కూడా లోనయ్యాయి. వెరసి నిబంధన లు పాటించకపోవడంతో నిషేధానికి(సస్పెన్షన్) గురయ్యాయి. ఈ బాటలో సస్పెండ్ అయిన కంపెనీల సంఖ్య ఇప్పటికే 1,200కు చేరగా, మరికొన్ని కంపెనీలు అదే బాటలో నడుస్తుండటం గమనార్హం! కాగా, ఈ 1,200 కంపెనీలను ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్ నుంచి నిషేధించడంతో సుమారు రూ. 2,500 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాయి. పెరుగుతున్న జాబితా గతేడాది నుంచి ఎక్స్ఛేంజీల సస్పెన్షన్కు గురవుతున్న కంపెనీల జాబితా పెరుగుతుండటం చెప్పుకోదగ్గ పరిణామం. ఇందుకు ఆర్థిక మందగమనం, డిమాండ్ పడిపోవడం, గరిష్ట వడ్డీ రేట్లు, పెట్టుబడుల ఆవిరి వంటి కారణాలను కంపెనీలు చూపినప్పటికీ యాజమాన్య లోపాలే అధికమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా 2011లో నిషేధానికి లోనైన కంపెనీలతో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య రెట్టింపునకుపైగా పెరిగింది. ఇక ఈ ఏడాది కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూ ఇప్పటివరకూ 48 కంపెనీలు ఎక్స్ఛేంజీల కన్నెర్రకు లోనయ్యాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల నిషేధం కారణంగా లిస్టింగ్ను కోల్పోయిన కంపెనీలు సుమారు 1,200 వరకూ ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ రోజువారీ ట్రేడింగ్లో అత్యధికంగా ట్రేడయ్యే షేర్ల సంఖ్యలో ఇవి సగం కావడం విశేషం! ఎక్స్ఛేంజీలలో చివరిసారిగా ట్రేడైన ధరల ప్రకారం చూసినా ఈ కంపెనీలలో రూ. 2,500 కోట్లమేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఈ పెట్టుబడులు తక్కువగానే కనిపించినప్పటికీ వీటిలో అత్యధిక శాతం కంపెనీలు నష్టాలను నమోదు చేయడంతో వీటి విలువ కనీస స్థాయికి చేరిందన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. సస్పెన్షన్ ఎందుకు? సాధారణ పరిస్థితుల్లో కంపెనీలు లిస్టింగ్ నిబంధనలను అమలు చేయకపోతే స్టాక్ ఎక్స్ఛేంజీలు సస్పెన్షన్ను అమలు చేస్తాయి. వీటిలో ఆర్థిక ఫలితాల దాఖలు, వాటాదారుల వివరాలు, కార్పొరేట్ పరిపాలన(గవర్నెన్స్) వంటి అంశాలలో వరుసగా రెండు క్వార్టర్లపాటు కంపెనీలు విఫలంకావడం వంటివి ఉంటాయి. ఇవికాకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం అవకతవకలకు పాల్పడిన ట్లు గుర్తిస్తే ట్రేడింగ్ నుంచి కంపెనీలను నిషేధిస్తుంది. ఇలా నిషేధానికి గురైన సంస్థలలో వత్సా మ్యూజిక్, వత్సా కార్పొరేషన్ తదితరాలున్నాయి. ఈ ఇష్యూలలో రూ. 11,000 కోట్లమేర ఇన్వెస్టర్ల నిధులు చిక్కుకుపోయాయి. ఇక ఐపీవోకు సంబంధించి పిరమిడ్ సాయిమీరాను, షేరు ధర రిగ్గింగ్కు పాల్పడిందన్న కారణంతో డీఎస్క్యూ బయోటెక్ను సెబీ నిషేధించింది. నిజానికి లిస్టింగ్ నిబంధనలను పాటించలేని కంపెనీలను నిషేధించడమే సరైన ప్రక్రియఅని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా ఇన్వెస్టర్లు కొంతలోకొంత తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు అవకాశం చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే ఇన్వెస్టర్లు తాము ఎంచుకున్న కంపెనీ నిర్వహిస్తున్న బిజినెస్తోపాటు, యాజమాన్య పటిష్టత, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలను కూడా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement