విమాన టికెట్లపైనా ఇక సెస్ ! | Cess riding on air ticket | Sakshi
Sakshi News home page

విమాన టికెట్లపైనా ఇక సెస్ !

Aug 28 2015 1:43 AM | Updated on Oct 20 2018 7:44 PM

విమాన టికెట్లపైనా ఇక సెస్ ! - Sakshi

విమాన టికెట్లపైనా ఇక సెస్ !

విమాన టికెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది...

- త్వరలో కొత్త పౌర విమానయాన విధానం
న్యూఢిల్లీ:
విమాన టికెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సుంకం నిధులతో మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ఈ కొత్త పౌర విమానయాన విధానంపై తుది కసరత్తు జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు.

ఈ రంగం వృద్ధికి దీర్ఘకాల వ్యూహాన్ని ఈ విధానం అందిస్తుందని వివరించారు. పరిశ్రమకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కాగా కొన్ని విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని  ఇదే సమావేశంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారని శర్మ తెలిపారు. అత్యవసర సమయాల్లో విమానయాన సంస్థలు విమాన ధరలను పెంచుతున్నాయని, వైద్యపరమైన అత్యవసర సమయాల్లో ధరలను పెంచడానికి బదులుగా తగ్గించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement