'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి | Apple case against Samsung should go back to lower court: Justice Dept | Sakshi
Sakshi News home page

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి

Jun 9 2016 11:37 AM | Updated on Aug 20 2018 2:55 PM

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి - Sakshi

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి

శామ్ సంగ్ పై యాపిల్ పెట్టిన కేసును తిరిగి కింద కోర్టుకు బదలాయించాలని అమెరికా సుప్రీంకోర్టును ఆ దేశ న్యాయశాఖ కోరింది.

శామ్ సంగ్ పై యాపిల్ పెట్టిన కేసు విచారణను తిరిగి కింద కోర్టుకు బదలాయించాలని అమెరికా సుప్రీంకోర్టును ఆ దేశ న్యాయశాఖ కోరింది. స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై నడుస్తున్న ఈ కేసుపై మరింత విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తున్నందున్న దీన్ని ట్రయల్ కోర్టుకు పంపాలని న్యాయశాఖ అడుగుతోంది. 

2011 నుంచి  స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై ఈ రెండు దిగ్గజాల మధ్య వార్ నడుస్తోంది. ఐఫోన్ పేటెంట్లను, డిజైన్లను, ట్రేడ్ మార్క్ లను శామ్ సంగ్ ఉల్లఘించిందని ఆరోపణలు చేస్తూ.. శామ్ సంగ్ పై  యాపిల్ పేటెంట్ దావా వేసింది. 2012లో తొలిసారి విచారణకు వచ్చిన ఈ దావా కేసులో, జ్యూరీ ట్రయల్ యాపిల్ కు 9300లక్షల డాలర్లు చెల్లించాలని శామ్ సంగ్ కు ఆదేశాలు జారీచేసింది.

ఆ మొత్తాన్ని తగ్గించాలని అప్పటినుంచి శామ్ సంగ్ అమెరికా కోర్టులో పోరాటం చేస్తోంది. శామ్ సంగ్ ప్రయత్నాలు కొంత అనుకూలించి 2015 మే లో ఈ మొత్తాన్ని 5480లక్షల డాలర్లకు అమెరికా కోర్టు తగ్గించింది. అయితే పేటెంట్ డిజైన్ పైనా, అధికమొత్తంలో విధించిన పేటెంట్ దావా జరిమానపై పునఃవిచారణ చేపట్టాలని కోరుతూ శామ్ సంగ్ సుప్రీంకోర్టు గడపతొక్కింది. డిజైన్ పేటెంట్లను ఉల్లంఘించినప్పుడు కేవలం ఆ ఉత్పత్తి మొత్తం లాభాల్లోంచే నష్టపరిహారం చెల్లించేలా కోర్టులు ఆదేశించాలని శామ్ సంగ్ సుప్రీంను కోరింది.

అదీకూడా ఆ పేటెంట్ కేవలం ప్రొడక్ట్ కాంపొనెంట్లకే చెందుతుందని వాదిస్తోంది. అయితే శామ్ సంగ్ వాదనలను అమెరికా కోర్టు తోసిపుచ్చింది. ఆ కేసును ట్రయల్ కోర్టుకు సుప్రీం బదలాయించాలని, ఈ విషయంపై కొత్తగా విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తోందని న్యాయశాఖ పేర్కొంది. అయితే శామ్ సంగ్ వాదిస్తున్న వాదనలపై స్పందించడానికి యాపిల్ అధికార ప్రతినిధి తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement