ఆర్తి డ్రగ్స్‌,అదాని గ్రీన్‌ ఎనర్జీ-52 వీక్స్‌ హై

52 weeks low and high shares - Sakshi

గురువారం స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 17 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఏడాది గరిష్టానికి చేరిన షేర్లలో ఆర్తి డ్రగ్స్‌, అదాని గ్రీన్‌ ఎనర్జీ, ఆల్‌కెమిస్ట్‌, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌, బిర్లా టైర్స్‌, ధనుక అగ్రిటెక్‌, ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎడ్యుకంప్‌ సొల్యూషన్స్‌, గోయెంక డైమండ్‌ అండ్‌ జువెల్స్‌, ఐడీబీఐ మ్యూచువల్‌ ఫండ్‌, జిందాల్‌ పాలి ఫిల్మ్స్‌, క్యాప్‌స్టన్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, మిట్టల్‌ లైఫ్‌స్టైల్‌, ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌, వినైల్‌ కెమికల్స్‌(ఇండియా)లు ఉన్నాయి.

కనిష్టానికి పతనమైన షేర్లు
నేడు ఎన్‌ఎస్‌ఈలో 9 షేర్లు మాత్రమే ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి.వీటిలో అర్మాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బి.సి పవర్‌ కంట్రోల్స్‌, కృష్ణా ఫోస్కెమ్‌, మాస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ముకుంద్‌ ఇంజినీర్స్‌, రాజ్‌ రెయాన్‌ ఇండస్ట్రీస్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌, సుందరం మల్టీ ప్యాప్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 1:40 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 532.37 పాయింట్లు లాభపడి 32,137.59 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ155.20 పాయింట్లు లాభపడి 9,470.15 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top