ఎమెస్కో ప్రచురించిందే అసలైన పుస్తకం | Sakshi
Sakshi News home page

ఎమెస్కో ప్రచురించిందే అసలైన పుస్తకం

Published Sun, Jul 12 2020 5:43 AM

YV Subba Reddy complained to DGP about fake PDF of YSR Book - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ తన భర్తపై రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి, అదే పేరుతో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైలుకు ఏమాత్రం సంబంధం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ సంస్థ ప్రచురించిందే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పుస్తకంలోని అంశాలు, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైలులోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఆ ఫైల్‌ను దురుద్దేశంతో సర్క్యులేట్‌ చేస్తుండటంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, అభిమానులు దీన్ని గమనించాలని తెలిపారు.

Advertisement
Advertisement