ఎమెస్కో ప్రచురించిందే అసలైన పుస్తకం

‘నకిలీ పీడీఎఫ్’ సర్క్యులేషన్పై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్తపై రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకానికి, అదే పేరుతో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైలుకు ఏమాత్రం సంబంధం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమెస్కో పబ్లిషర్స్ సంస్థ ప్రచురించిందే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పుస్తకంలోని అంశాలు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైలులోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఆ ఫైల్ను దురుద్దేశంతో సర్క్యులేట్ చేస్తుండటంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, అభిమానులు దీన్ని గమనించాలని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి