కొనసాగుతున్న వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర | YV Subba Reddy 11th Day Padayatra Begins | Sakshi
Sakshi News home page

Aug 25 2018 12:05 PM | Updated on Aug 25 2018 12:17 PM

YV Subba Reddy 11th Day Padayatra Begins - Sakshi

సాక్షి, ప్రకాశం : ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర 11వ రోజుకు చేరింది. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూస్తున్నారని, జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారే తప్పా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జిల్లా తాగు, సాగు నీరు సమస్య తీరాలని, అది వెలిగొండ ప్రాజెక్టుతోనే ఈ సమస్య తీరనుందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చాక ఏడాదిలోగా పూర్తి చేస్తాం
చంద్రబాబు ప్రకాశం జిల్లా రైతులను నట్టేట ముంచారని, వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబువి దొంగ మాటలని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోని పూర్తిచేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, నాలుగేళ్లు గడిచిన ఇంత వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. జిల్లా కరువు కొరల్లో చిక్కుకుందని, ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఏడాదిలోపు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, 15 రోజుల పాటు సుమారు 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తన పాదయాత్రకి మద్దతిస్తున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement