చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిందా?

YSRCP MP Mithun Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అవినీతికి తావులేకుండా గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో టీడీపీ హయాంలో జరిగిన వేల కోట్లు అవినీతిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బయటకు తీసిందన్నారు.

ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలపై ఇతర రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేసి చర్చిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. చిన్న మెదడు చిట్లిందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top