
రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలు సోమవారం అక్కడ పర్యటించనున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలు సోమవారం అక్కడ పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చిలో ప్రారంభమవనున్నఅసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారు.
రాజధాని గ్రామాలైన తుళ్లూరు, రాయపూడి, లింగాయపాళెం, ఉద్దండరాయుని పాళెం, తాళ్లాయ పాళెం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లిలో వైఎస్ఆర్ సీపీఎల్పీ బృందం పర్యటిస్తుంది. అనంతరం సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ ను కలిసి వినితిపత్రం అందజేయనుంది.