MLAs tour
-
జైపూర్ టు జైసల్మేర్
జైపూర్/జైసల్మేర్: ఆగస్ట్ 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలు వైరి పక్షం చేరకుండా, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా, శుక్రవారం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి ఐదు ప్రత్యేక విమానాల్లో జైసల్మేర్కు తరలించారు. వారితో పాటు సీఎం గెహ్లోత్ కూడా ఉన్నారు. దాదాపు 100 మంది వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. జైసల్మేర్లోని హోటల్ సూర్య గఢ్లో వారికి విడిది కల్పించారు. సచిన్ పైలట్ నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేసినప్పటి నుంచి.. గహ్లోత్ తరఫు ఎమ్మెల్యేలంతా జైపూర్ శివార్లలోని ఫెయిర్మాంట్ హోటల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పోలీసులకు నో ఎంట్రీ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన హరియాణాలోని గురుగ్రామ్, మానేసర్ల్లోని రిసార్ట్ల్లోకి వెళ్లేందుకు శుక్రవారం రాజస్తాన్ అవినీతి నిరోధక విభాగం పోలీసులకు అనుమతి లభించలేదు. ఒక అవినీతి కేసుకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్లకు నోటీసులు అందజేయడం కోసం ఏసీబీ ఆ రిసార్ట్ల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టులో చీఫ్ విప్ పిటిషన్ సచిన్ పైలట్ నాయకత్వంలోని 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్తాన్ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో విలీనం చేసుకోవడంపై బీజేపీ విమర్శ లు చేయడాన్ని సీఎం గహ్లోత్ తప్పుబట్టారు. నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాషాయ పార్టీవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ‘మీరు నలుగురు టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం సరైన చర్యే కానీ.. మేం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పా?’అని ట్వీట్ చేశారు. ‘మీకేమైంది? రాత్రింబవళ్లు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలను కూల్చే ఆలోచనలే ఎందుకు చేస్తున్నారు?’అని హోం మంత్రి అమిత్షాను గహ్లోత్ ప్రశ్నించారు. -
రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
-
రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పర్యటన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలు సోమవారం అక్కడ పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చిలో ప్రారంభమవనున్నఅసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారు. రాజధాని గ్రామాలైన తుళ్లూరు, రాయపూడి, లింగాయపాళెం, ఉద్దండరాయుని పాళెం, తాళ్లాయ పాళెం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లిలో వైఎస్ఆర్ సీపీఎల్పీ బృందం పర్యటిస్తుంది. అనంతరం సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ ను కలిసి వినితిపత్రం అందజేయనుంది. -
23న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పర్యటన
రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి - రైతుల్ని బెదిరించి మరీ భూములు తీసుకుంటున్నారు - దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పార్టీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలంతా ఆ రోజున రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి.. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్తో కలసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎమ్మెల్యేలందరూ 23న విజయవాడకు చేరుకుని అక్కడినుంచి రాజధాని గ్రామాలకు బయలుదేరతారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో జరగాల్సి ఉండగా సీఎం చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోకుండా నిరంకుశంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. ఈ విషయంలో ప్రజల్నిగానీ, ప్రజా సంస్థలనుగానీ, ప్రతిపక్షాన్నిగానీ లెక్క చేయకుండా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకోసం అప్రజాస్వామికంగా ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. రైతులనుంచి రాజధానికోసం సేకరిస్తున్న భూమిని వ్యాపార ప్రయోజనాలకోసం వాడుకోబోతున్నట్లు తేటతెల్లమైందన్నారు. అనుభవజ్ఞుడని చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంటే రైతుల భూములను లాక్కుని వాటితో వ్యాపారంచేసి కోట్లు గడించాలనుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. స్వచ్ఛందంగా భూములిచ్చేవారి నుంచే సేకరిస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు.. ఆచరణలో మాత్రం రైతులను బెదిరించి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారన్నారు. భూములివ్వబోమని తీవ్రంగా ప్రతిఘటించిన బోయపాటి సుధారాణి అనే మహిళను పోలీసుల ద్వారా బెదిరించి భూములను తీసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బహుళ పంటలు పండే భూములను తీసుకోవడాన్నీ తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడినపుడల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, జగన్కు భూములున్నాయి కనుక దొనకొండలో పెట్టాలని చెబుతున్నారని, అసంబద్ధమైన రీతిలో టీడీపీ నేతలు, మంత్రులు మాట్లాడారని ఆయన విమర్శించారు.