మొక్కు తీర్చుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే | YSRCP MLA Sudheer Reddy Starts Padayatra To Tirumala | Sakshi
Sakshi News home page

మొక్కు తీర్చుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

Jun 23 2019 8:11 PM | Updated on Jun 23 2019 8:14 PM

YSRCP MLA Sudheer Reddy Starts Padayatra To Tirumala - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జమ్మలమడుగు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తన మొక్కును తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర ద్వారా వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడంతో ఆయన కోరిక నెరవేరింది. దీంతో సుధీర్‌రెడ్డి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి నుంచి తిరుమల వరకు ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాయంలో ఇప్పటికే రాష్ట్రం సువర్ణ పరిపాలన దిశగా అడుగు వేస్తోందన్నారు. ఫ్యాక్షన్‌ చరిత్ర నుంచి జమ్మలమడుగు అభివృద్ధి దిశగా పయనించడమే తన కోరిక అని సుధీర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement