'భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయండి' | YSRCP MLA Chand baasha meets district collector with np kunta victims | Sakshi
Sakshi News home page

'భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయండి'

Apr 22 2015 7:33 PM | Updated on May 29 2018 4:15 PM

అనంతపురం ఎన్పీకుంటలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా కలెక్టర్ని కోరారు.

అనంతపురం: అనంతపురం ఎన్పీకుంటలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా కలెక్టర్ని కోరారు. ఈ సందర్భంగా ఎన్పీకుంటలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా భూములుసాగు చేసుకుంటున్న రైతులకు నష్ట పరిహారం దక్కలేదని కలెక్టర్ కి వివరించారు.

 

రాజకీయ ఒత్తిళ్లతో ప్రైవేట్ వ్యక్తులను జాబితాలో చేర్చి నిజమైన రైతుల పొట్టకొడుతున్నారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని చాంద్ బాషా కలెక్టర్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement