‘టీడీపీ మహానాడు దయ్యాల సభ’ | ysrcp leader tammineni sitaram slams tdp mahanadu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ మహానాడు దయ్యాల సభ’

May 29 2017 8:17 PM | Updated on Aug 11 2018 4:28 PM

మహానాడును కేవలం చంద్రబాబు భజన కోసమే ఏర్పాటు చేశారని తమ్మినేని సీతారాం అన్నారు.

శ్రీకాకుళం: టీడీపీ మహానాడును కేవలం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ భజన కోసమే ఏర్పాటు చేశారని వైఎస్‌ఆర్‌ సీపీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఆంధ్రా యూనివర్శిటీని దెయ్యాల కొంప​ అని టీడీపీ ఎమ్మెల్సీ అన్నట్లు... ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు ఓ దెయ్యాల సమావేశం అని ఆయన ఎద్దేవా చేశారు.

అక్కడ జరిగిందిన మహానాడు కాదని, మాయనాడు అని తమ్మినేని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా మహానాడు సాగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిలో ఏపీ బ్రహ్మాండంగా దూసుకుపోతుందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement