సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ | YSRCP expell mandal meeting in eastgodavari district | Sakshi
Sakshi News home page

సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

Aug 7 2015 6:25 PM | Updated on May 29 2018 4:23 PM

వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు బహిష్కరించారు.

తూర్పుగోదావరి (వై.రామవరం): వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు బహిష్కరించారు. అభివృద్థి కార్యక్రమాల గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరీ(రంపచోడవరం), స్థానిక ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మీలతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రభుత్వాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement