గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీ | YSRCP Condemn Punuru Gowtham Reddy Comments | Sakshi
Sakshi News home page

గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీ

Sep 3 2017 3:38 PM | Updated on May 29 2018 4:40 PM

విలేకరులతో మాట్లాడుతున్న పార్థసారధి - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న పార్థసారధి

వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఖండించింది.

సాక్షి, హైదరాబాద్‌: వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారధి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement