మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య | YSR Congress Supporter Killed In Guntur District | Sakshi
Sakshi News home page

మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య

Sep 11 2014 2:06 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డిపై పచ్చపార్టీ కార్యకర్తలు కత్తులు, గోడ్డళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో గోవిందరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారైయ్యారు.

ఈ ఘటన గోవిందరెడ్డి ఇంటి ముందే చోటు చేసుకుంది. దాంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గోవిందరెడ్డి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవ్వరూ అటు వైపునకు రాకపోవడం గమనార్హం. గోవిందరెడ్డి హత్యతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యల సంఖ్య ఆరుకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement