వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు | YSR Congress a hundred seats in seemandra | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు

May 15 2014 1:03 AM | Updated on May 25 2018 9:17 PM

వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు

సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ముందంజ అని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

 సీమాంధ్రలో అసెంబ్లీ ఫలితాలపై ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్
 
హైదరాబాద్: సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ముందంజ అని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ 80 నుంచి 100 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంద ని తేల్చింది. అలాగే టీడీపీకి 75-90 వరకు రావొచ్చని తెలిపింది. ఇతరులు 5 నుంచి 15 స్థానాలు గెలుపొందుతారని సర్వే స్పష్టం చేసింది.

లోక్‌సభ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమానంగా 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 12, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి 13 స్థానాలు వస్తాయని తెలిపింది. బుధవారం ప్రసారం చేసిన ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు మాత్రం ఫలితాలు ఏకపక్షంగా జగన్ వైపే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకన్నా వైఎస్సార్ సీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్.రామ్ పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement