వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే | YS Jagan's leadership is required to Andhrapradesh state people | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే

Aug 31 2013 12:05 PM | Updated on Aug 8 2018 5:51 PM

వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ శనివారం హైదరాబాద్ లో విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు త్యాగాలకు పూనుకోవద్దని ఆయన జగన్కు ఈ సందర్భంగా హితవు పలికారు.

 

వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయంలో ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మీ నాయకత్వం ప్రజలకు చాలా అవసరమని ఈ సందర్భంగా జగన్కు ఏబీకే ప్రసాద్ గుర్తు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్దమైందని ఏబీకే ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement