
నేడు వైఎస్ జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కొవ్వూరు రానున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కొవ్వూరు రానున్నారు. రాజ మండ్రి నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు కొవ్వూరు చేరుకుంటారు. ఇక్కడి వీఐపీ ఘాట్లో పుష్కర స్నానమాచరిస్తారు. అనంతరం రాజమండ్రికి తిరిగి వెళ్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.