టీమిండియాకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

YS Jagan Tweet On Team India Victory In Asia Cup 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియాకప్‌ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ చివరి బంతికి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆసియా’ మనదే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top