259వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan PrajaSankalpaYatra 259th Day Schedule Released - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 259వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం వరకు కొనసాగుతుంది. అక్కడ జననేత పాదయాత్ర విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత  దొండపర్తి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌  మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

అనంతరం జననేత పాదయాత్ర విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. వాల్తేరులో బ్రహ్మణుల ఆత్మీయ సదస్సులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. వాల్తేరు మెయిన్‌ రోడు మీదుగా చిన్న వాల్తేరు వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 258వ రోజు పాదయాత్ర ఆదివారం తాటిచెట్లపాలెం వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర గోపాలపట్నం జంక్షన్‌, బాజీ జంక్షన్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, ఓల్డ్‌ కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా తాటిచెట్లపాలెం వరకు 8.8 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 2,926.1 కిలోమీటర్లు నడిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top