వైఎస్ జగన్ డిశ్చార్జి, చంచల్ గూడ తరలింపు | YS Jagan Mohan Reddy shifted to Chanchal Guda, Discharged from NIIMS | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ డిశ్చార్జి, చంచల్ గూడ తరలింపు

Sep 4 2013 9:37 PM | Updated on Jul 28 2018 6:26 PM

వైఎస్ జగన్ డిశ్చార్జి, చంచల్ గూడ తరలింపు - Sakshi

వైఎస్ జగన్ డిశ్చార్జి, చంచల్ గూడ తరలింపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాటకీయ ఫక్కీలో నిమ్స్ నుంచి డిశార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాటకీయ ఫక్కీలో నిమ్స్ నుంచి డిశార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మెరుగైందని జైలు అధికారులకు బుధవారం సాయంత్రం నిమ్స్ వైద్యులు సమాచారం అందించారు. దాంతో వైఎస్ జగన్ ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో చంచల్ గూడ జైలుకు తరలించారు. 
 
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ చంచల్ గూడ జైలులో ఆమరణ దీక్షను చేపట్టారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తొలుత ఉస్మానియా ఆస్పత్రి, ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స నందించారు. గత ఐదు రోజులుగా వైఎస్ జగన్ కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement