మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Responded On YSRCP MPS Resignations | Sakshi
Sakshi News home page

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

Jun 6 2018 10:43 PM | Updated on Jul 24 2018 1:16 PM

YS Jagan Mohan Reddy Responded On YSRCP MPS Resignations - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది’ అని జగన్‌ తన ట్వీట్‌లో ఎంపీలను అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement