'మాట్లాడేందుకు అరగంట టైమ్ ఇవ్వండి' | ys jagan mohan reddy appeals to speaker over time | Sakshi
Sakshi News home page

'మాట్లాడేందుకు అరగంట టైమ్ ఇవ్వండి'

Aug 27 2014 11:27 AM | Updated on Aug 18 2018 5:15 PM

'మాట్లాడేందుకు అరగంట టైమ్ ఇవ్వండి' - Sakshi

'మాట్లాడేందుకు అరగంట టైమ్ ఇవ్వండి'

బడ్జెట్ కేటాయింపులపై చర్చలో తనకు అరగంటపాటు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్ని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.

హైదరాబాద్ : బడ్జెట్ కేటాయింపులపై చర్చలో తనకు అరగంటపాటు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్ని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.  ఇంకా చాలా విషయాలు ప్రస్తావించాల్సి ఉన్నందువల్ల మరో అరగంట సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.

 

రుణమాఫీపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసి అనంతరం సమావేశాలకు హాజరైన వైఎస్ జగన్ ఈ మేరకు కోరారు. అయితే సమయం ఇచ్చేందుకు హామీ ఇవ్వని స్పీకర్ అప్పటి పరిస్థితి చూద్దామంటూ టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావును ప్రసంగం కొనసాగించాలని సూచించారు.

అంతకు ముందు సభ నుంచి వాకౌట్ చేసినా.. సభలో ఇంకా సభ్యుడు ఉండడాన్ని అధికార పక్షం ప్రశ్నించింది. దీనిపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ.. వివరణ ఇచ్చారు. అయితే సభ నుంచి వాకౌట్ చేసిన తరువాత.. అదే విషయంపై ఇంకా చర్చ జరుగుతుంటే.. మాట్లాడడం సరికాదని స్పీకర్ సూచన చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement