శత్రువులను సైతం క్షమించడమే క్రీస్తుతత్వం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Extend Christmas Greetings To Telugu People | Sakshi
Sakshi News home page

Dec 24 2018 12:48 PM | Updated on Dec 24 2018 3:42 PM

YS Jagan Extend Christmas Greetings To Telugu People - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమను, శాంతియుత సహజీవనం, సహనం, శత్రువుల పట్ల క్షమాగుణం.. ఇవన్నీ మానవాళికి క్రీస్తు తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలని ఆయన గుర్తు చేశారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement