సినారె జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Condolence to Dr C Narayana Reddy family | Sakshi
Sakshi News home page

సినారె జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌

Jun 12 2017 9:56 AM | Updated on Jul 25 2018 4:42 PM

సినారె జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌ - Sakshi

సినారె జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

హైదరాబాద్‌: మహాకవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యరంగంలో ఓ మహా ధ్రువతార నేలరాలిందని, సినారె మరణం తెలుగుజాతికి తీరనిలోటు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రైతు కుటుంబంలో పుట్టిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని, కవిగా, మృదుభాషిగా, మానవతావాదిగా, సినీ గేయరచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా.. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని వైఎస్‌ జగన్‌ అన్నారు. సినారె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌.. తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement