289వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 289th Day PrajaSankalpaYatra Schedule Released - Sakshi

సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 289వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు శనివారం ఉదయం బొబ్బిలి మండలంలో ఇందిరమ్మ కాలనీ, పొలవాని వలస, మెట్టల వలస మీదుగా పాదయాత్రను చేపడతారు. మధ్యాహ్న భోజన సమయం తరువాత భోజరాజ పురం, సీతారామపురం, పారాడి వరకు జననేత పాదయాత్రను కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top