253వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan 253th Day Prajasankalpayatra Begins  | Sakshi
Sakshi News home page

253వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Sep 3 2018 7:53 AM | Updated on Sep 3 2018 10:16 AM

YS Jagan 253th Day Prajasankalpayatra Begins  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 253వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం మాడుగుల నియోజకవర్గం ములకలాపల్లిలో ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపెంట, ఎ. భీమవరం, పడుగు పాలెం‌, ఎ. కోడూరు మీదుగా కె. కోటపాడు వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. సాయంత్రం కె. కోటపాడులో బహిరంగ సభ జరగనుంది.

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement