పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు | young couple went to police station for protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు

Nov 6 2013 12:17 AM | Updated on Sep 2 2017 12:18 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణ కల్పించాలని మంగళవారం కొల్చారం పోలీసులను ఆశ్రయించారు.

కొల్చారం, న్యూస్‌లైన్:  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణ కల్పించాలని మంగళవారం కొల్చారం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం...కొల్చారం గ్రామానికి చెందిన బోరంపేట దుర్గయ్య కుమారుడు శేఖర్, చిన్నఘణాపూర్ గ్రామానికి చెందిన  శేరిపల్లి కమలమ్మ కూతురు మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురికీ బం ధుత్వం ఉన్నప్పటికీ వీరి వివాహానికి శేఖర్ తల్లి అభ్యం తరం తెలిపింది. దీంతో శేఖర్, మాధవిలు అక్టోబర్ 29వ తేదీన ఏడుపాయల దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి సోమవారం ఇంటికి రాగా, దంపతులను శేఖర్ తల్లి వెళ్లగొట్టింది. దీంతో నవదంపతులు కొల్చారం పోలీసులను ఆశ్రయించడంతో స్పందించిన ఎస్‌ఐ ఇరుకుటుం బాలవారినీ  పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించా రు. అయితే శేఖర్ తల్లి ఒప్పుకోకపోవడంతో మేజర్లయిన వీరికి చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు శేఖర్, మాధవిల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement