సమైక్య రాష్ట్రంలోనే జగన్ సీఎం అవుతారు | Y.S.Jagan will become the chief minister of united andhrapradesh, says MP mekapati rajamohan reddy | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్రంలోనే జగన్ సీఎం అవుతారు

Sep 13 2013 2:41 PM | Updated on Sep 1 2017 10:41 PM

సమైక్య రాష్ట్రంలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారని, అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలకపాత్ర పోషిస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమైక్యరాష్ట్రంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారన్నారు. ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలకపాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు.

 

జగన్ త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల అవుతారన్నారు. తమ పార్టీకి భారత న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల్లోకి రాకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కోరుకుంటున్నారని మేకపాటి ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement