విభజన బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే, పార్టీ నుంచి తప్పుకుంటానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే, పార్టీ నుంచి తప్పుకుంటానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆత్మసాక్షిగా సంతకం పెట్టలేదన్నారు. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన రోజు తెలుగు ప్రజలకు చీకటి రోజని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందితే.. అది పార్లమెంటులో పూర్తిస్థాయిలో ఆగిపోవడం కష్టమని అన్నారు. విభజన బిల్లు విషయమై పార్టీ వైఖరి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఆయన పార్టీనుంచి బయటకు వస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.