విజ్ఞానకేంద్రం విశ్వోదయ | Vijnanakendram visvodaya | Sakshi
Sakshi News home page

విజ్ఞానకేంద్రం విశ్వోదయ

Nov 15 2014 2:09 AM | Updated on Sep 2 2017 4:28 PM

విజ్ఞానకేంద్రం విశ్వోదయ

విజ్ఞానకేంద్రం విశ్వోదయ

విద్యార్థుల ఉజ్వల భవి తను తీరిదిద్దే విజ్ఙాన కేంద్రం విశ్వోదయ విద్యాసంస్థ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.

ప్రజాగాయకుడు గద్దర్
 
 కావలి:  విద్యార్థుల ఉజ్వల భవి తను తీరిదిద్దే విజ్ఙాన కేంద్రం విశ్వోదయ విద్యాసంస్థ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.  స్థానిక విశ్వోదయ విద్యాసంస్థల వ్యవస్థాపక దినం సందర్భంగా శుక్రవారం రాత్రి గద్దర్‌కు ఆ సంస్థ నిర్వాహకులు విశ్వోదయ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. గద్దర్ మాట్లాడుతూ విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు దివంగత దొడ్ల రామచంద్రారెడ్డి ఎంతో మందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తన్నారు.

ఎస్‌ఆర్ శంకరన్ లాంటి వ్యక్తులే ఈ విద్యాసంస్థలకు వచ్చారంటే అతని గొప్పతనం అర్ధమవుతుందన్నారు. ఇక్కడ చదివిన సుబ్రహ్మణ్యం ఐఏఎస్ పూర్తి చేసి ముఖ్యమంత్రి కార్యదర్శి అయ్యాడంటే ఈ విద్యాసంస్థల్లో పాఠాలు ఎలా బోధిస్తారో అర్థమవుతోందన్నారు.  చిన్నారులతో కలిసి గద్దర్  పాటలు పాడారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు  డాక్టర్ రామ్‌సెంటర్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్‌రెడ్డి, డెరైక్టర్ తాతిరెడ్డి, విశ్వోదయ విద్యాసంస్థలకు చెందిన కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement