జీవిత చరమాంకంలో వృద్ధురాలి దయనీయ స్థితి
భర్త, కొడుకు అర్ధంతరంగా దూరమయ్యారు
రెక్కల కష్టంతో కూతురిని అత్తారింటింకి పంపింది
వయసుడిగింది.. ఆరోగ్యం క్షీణించింది
ఇంటి ఓనరు గెంటేయడంతో రోడ్డున పడింది
ఐదురోజులుగా దయనీయ స్థితిలో వరలక్ష్మి
రాజాం: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త.. చరమాంకంలో సంరక్షించాల్సిన కొడుకును పోగొట్టుకుంది. కూతుర్ని పెంచి, పెళ్లి చేసి అత్తారింటికి పంపేసింది. ఇప్పుడు వయసుడిగింది. ఆరోగ్యం పడకేసింది. ఇన్నేళ్లూ సహకరించిన రెక్కలు ఇక తమ వల్ల కాదన్నాయి. ఫలితంగా ఆ పండుటాకు మంచానికి పరిమితమైంది. ఇంటి ఓనరు గెంటివేయడంతో బస్సు షెల్టరే ఆమెకు ఆవాసంగా ఎవరో నాలుగు మెతుకులు పెడితే ఆ పూటకు గడి చిందనుకోవడం. లేని నాడు నీళ్లతో కడుపు నింపుకొంటూ క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ అభాగ్యురాలు అయినంపూడి వరలక్ష్మి. సుమారు 60 ఏళ్ల వయసున్న ఈ వృద్ధురాలు స్థానిక చీపురుపల్లి రోడ్డులోని పోలీసు స్టేషన్ మలుపు వద్ద ఉన్న బస్సు షెల్టరే ఆవాసంగా నాలుగైదు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది.
భర్త చినబాబు, ఇద్దరు పిల్లలతో 18 ఏళ్ల క్రితం రాజాం పట్టణానికి వచ్చిన ఈమె కుటుంబం మల్లికార్జున కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుంటోంది. కాలక్రమంలో భర్త, కొడుకు చనిపోవడంతో ఉన్న ఆడపిల్లను తన రెక్కల కష్టంతోనే పెంచి పెద్ద చేసింది. పెళ్లి కూడా చేసి పంపించింది. ఏళ్ల తరబడి శారీరక శ్రమ, వయసు మీద పడటంతో ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది. సరైన భోజనం లేక, చూసే దక్షత లేక శుష్కించిపోయింది. దీంతో ఎక్కడ తమ ఇంట్లో మరణిస్తుందోనన్న భయంతో ఇంటి ఓనరు ఆమెను ఐదు రోజులు క్రితం ఖాళీ చేయించేశాడు.
విధిలేని స్థితిలో స్థానికుల సాయంతో ఉన్న కొద్దిపాటి సామాన్లతో వరలక్ష్మి బస్ షెల్టర్లోకి చేరింది. చుట్టుపక్కల వారు దయతలచి ఏదైనా పెడితే తింటోంది. లేనిరోజు ఆకలితో అలమటిస్తోంది. ఈమె దుస్థితిని ఆమె కుమార్తెకు తెలియజేద్దామన్నా ఆమె అత్తవారి అడ్రస్ చెప్పే స్థితిలో వరలక్ష్మి లేదు. కాగా ఈమె కుటుంబానికి ఇంతవరకు రేషన్, ఆధార్ కార్డు వంటివేవీ మంజూరు కాలేదు. దాంతో పింఛను కూడా అందే పరిస్థితి లేదు. అధికారులను కలిసినా, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించలేదని.. ఈ పరిస్థితుల్లో తనను త్వరగా తీసుకుపోవాలని వరలక్ష్మి వేదనతో దేవుడిని ప్రార్థిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, మానవతావాదులు స్పందించి ఆమెకు ఆసరా కల్పించాల్సిన అవసరం ఉంది.
అనారోగ్యమే తోడు.. బస్సు షెల్టరే నీడ
Published Thu, Apr 2 2015 4:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement