గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | unknown dead body in rajampet | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Aug 16 2015 4:54 PM | Updated on Sep 3 2017 7:33 AM

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఆదివారం లభ్యమైంది.

రాజంపేట (వైఎస్సార్‌జిల్లా): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఆదివారం లభ్యమైంది. నదిలో వ్యక్తి (35) మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడు రెండు మూడు రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement