'సీఎంలు ఇద్దరు కలిసి పనిచేయాలి' | two states cms work to unity says jawadekar | Sakshi
Sakshi News home page

'సీఎంలు ఇద్దరు కలిసి పనిచేయాలి'

Jul 6 2015 7:16 PM | Updated on Aug 15 2018 9:27 PM

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్వేషాలు రెచ్చకుండా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచించారు.

హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్వేషాలు రెచ్చకుండా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచించారు. విభజనతో కేవలం రాజకీయ సరిహద్దులు మాత్రమే మారాయన్న ఆయన.. రెండు రాష్ట్రాలు వివాదాల జోలికి వెళ్లకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం బాగుందన్నారు. "క్లీన్ ఇండియా.. గ్రీన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రకాశ్ జవదేకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement